కావలసిన వస్తువులు :
బియ్యం : 1 కేజీ ( 24 గంటల ముందు నానబెట్టి వడకట్టి నీరు అంత పోయాక మిక్సీ పట్టి మెతగ్గా జల్లించి ఉంచాలి )
బెల్లం : 3/4 కేజీ( దీని ప్రకారం రైస్ బెల్లం వేసుకోవాలి )
యాలకుల పొడి : కొంచెం
నెయ్యి : 4 లేదా 5 స్పూన్స్
ఆయిల్ : 1/2 కేజీ
కొబ్బరి కాయ : 1 ( కోరి కొంచెం నేతిలో వేయించి ఉంచాలి)
తయారుచేయువిధానము :
బియ్యంపిండి రెడీ అయిన వెంటనే మనం బెల్లం కొబ్బరి పొంగడాలు చేసెయ్యాలి. ముందుగా స్టవ్ మీద గిన్ని పెట్టి గిన్నెలో బెల్లంవేసి కొంచెం వాటర్ వేసి మరగనివ్వాలి . కాసేపటికి చిన్నగిన్నెలో వాటర్ వేసి దానిలో బెల్లం పాకం కొంచెమువేసి ఉండపాకం లాగా వచ్చేవరకు చూడాలి. ( చాల జాగర్త గ) . కొంచెం వాటర్ చిన్న గిన్నెలో తీసుకొని రెడీ గాఉండాలి. మరగిన పాకం వాటర్ ఉన్న గిన్నెలో వేసి చేతితో కలిపితే దగ్గరికి అవుతుంది . అప్పటివరకు పాకాన్ని తిప్పి చూసుకుంటూ ఉండాలి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి కొబ్బరి వేసి , బియ్యం పిండి కొంచెం కొంచెం వేస్తూ గరిటతో తిప్పాలి. యాలకుల పొడి కూడా వెయ్యాలి. మరీ దగ్గరికి ముద్దగా కాకుండా మరీ లూస్ గ కాకుండా ఉండే వరకు పిండి ని వేసి తిప్పాలి. ఈలోపు కొంచెం వాటర్ ని మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆనీళ్ళని పైన పిండి లో వేసి గరిట జా రుగ కలపాలి . అదికూడా ఆయిల్ లో వేసినప్పుడు మరి పాకకుండా ఉండే టట్టు గ వెయ్యాలి . స్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ వేసి మరిగాక గుంట గరిటతో ఒక్క గరిట తో పిండి తీసి మద్యలో వెయ్యాలి. 2 నిమిషాలలో పైకి పొంగుతూ వస్తుంది . అప్పుడు రెండవ వైపు తిప్పాలి.
అట్లా అన్నీ ఒకొక్కటి వేసి మంచి కలర్ గ ఉడికేటట్టు వేసుకోవాలి. ఇవి చాల టేస్టుగా చాలరుచిగా,చాలారోజులు నిల్వ కూడా ఉంటాయి. బెల్లం కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది.
గమనిక : దీనిలో కొంచెం కొబ్బరి, కొంచెం బొంబాయి రవ్వ కూడా వేసుకుంటే కూడా చాల
టేస్ట్ గ కూడా ఉంటుంది. పాకంలో పిండి వేసే టప్పుడు ఒక వేళ పిండి మనకి చాలనప్పుడైనా బొంబాయి రవ్వ కలుపుకోవచ్చు. కంగారు పడకూడదు. చాలాబాగుంటుంది.
బియ్యం : 1 కేజీ ( 24 గంటల ముందు నానబెట్టి వడకట్టి నీరు అంత పోయాక మిక్సీ పట్టి మెతగ్గా జల్లించి ఉంచాలి )
బెల్లం : 3/4 కేజీ( దీని ప్రకారం రైస్ బెల్లం వేసుకోవాలి )
యాలకుల పొడి : కొంచెం
నెయ్యి : 4 లేదా 5 స్పూన్స్
ఆయిల్ : 1/2 కేజీ
కొబ్బరి కాయ : 1 ( కోరి కొంచెం నేతిలో వేయించి ఉంచాలి)
తయారుచేయువిధానము :
బియ్యంపిండి రెడీ అయిన వెంటనే మనం బెల్లం కొబ్బరి పొంగడాలు చేసెయ్యాలి. ముందుగా స్టవ్ మీద గిన్ని పెట్టి గిన్నెలో బెల్లంవేసి కొంచెం వాటర్ వేసి మరగనివ్వాలి . కాసేపటికి చిన్నగిన్నెలో వాటర్ వేసి దానిలో బెల్లం పాకం కొంచెమువేసి ఉండపాకం లాగా వచ్చేవరకు చూడాలి. ( చాల జాగర్త గ) . కొంచెం వాటర్ చిన్న గిన్నెలో తీసుకొని రెడీ గాఉండాలి. మరగిన పాకం వాటర్ ఉన్న గిన్నెలో వేసి చేతితో కలిపితే దగ్గరికి అవుతుంది . అప్పటివరకు పాకాన్ని తిప్పి చూసుకుంటూ ఉండాలి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి కొబ్బరి వేసి , బియ్యం పిండి కొంచెం కొంచెం వేస్తూ గరిటతో తిప్పాలి. యాలకుల పొడి కూడా వెయ్యాలి. మరీ దగ్గరికి ముద్దగా కాకుండా మరీ లూస్ గ కాకుండా ఉండే వరకు పిండి ని వేసి తిప్పాలి. ఈలోపు కొంచెం వాటర్ ని మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆనీళ్ళని పైన పిండి లో వేసి గరిట జా రుగ కలపాలి . అదికూడా ఆయిల్ లో వేసినప్పుడు మరి పాకకుండా ఉండే టట్టు గ వెయ్యాలి . స్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ వేసి మరిగాక గుంట గరిటతో ఒక్క గరిట తో పిండి తీసి మద్యలో వెయ్యాలి. 2 నిమిషాలలో పైకి పొంగుతూ వస్తుంది . అప్పుడు రెండవ వైపు తిప్పాలి.
అట్లా అన్నీ ఒకొక్కటి వేసి మంచి కలర్ గ ఉడికేటట్టు వేసుకోవాలి. ఇవి చాల టేస్టుగా చాలరుచిగా,చాలారోజులు నిల్వ కూడా ఉంటాయి. బెల్లం కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది.
గమనిక : దీనిలో కొంచెం కొబ్బరి, కొంచెం బొంబాయి రవ్వ కూడా వేసుకుంటే కూడా చాల
టేస్ట్ గ కూడా ఉంటుంది. పాకంలో పిండి వేసే టప్పుడు ఒక వేళ పిండి మనకి చాలనప్పుడైనా బొంబాయి రవ్వ కలుపుకోవచ్చు. కంగారు పడకూడదు. చాలాబాగుంటుంది.
No comments:
Post a Comment