కావలసినవస్తువులు :
మైదా : 200గ్ర ( జల్లించి ఉంచాలి)
సాల్ట్ : 1/2 స్పూన్
నెయ్యి : 3 స్పూన్స్
వామ్ము : 2 స్పూన్స్
వాటర్ : కొంచెం
తయారీవిధానము : ముందుగా ఒక బౌల్ లో మైదా, సాల్ట్ , వామ్ము, నెయ్యి, వేసి బా గాచేతితో కలపాలి . నెయ్యి బాగా కలిసాక కొంచెం ,కొంచెం వాటర్ వేసి కొంచెం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. దానిమీద గట్టిగ పిండిన కాటన్ బట్ట కప్పి కాసేపు ఉంచాలి. తరవాత పిండిని బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి సమోసాని కొన్ని ఆకారాలలో చేసుకోవచ్చు.
సమోసా లో కి సన్నగ కట్ చేసిన 1 ఆనియన్ , 3 సన్నగా కట్ చేసిన పర్చిమిర్చి ,కొంచెం కేరట్ తురుము, అటుకులు కొంచెం , సాల్ట్ కొంచెం కలిపి ఉంచుకోవాలి. మనకి నచ్చిన ఆకారాలలో చేసి ఆయిల్ లో సన్నటి సెగ మీద వేయించాలి. ఇవి టెస్ట్ కి టెస్ట్ మనకి మంచిదికూడా. ఈవెనింగ్ స్నేక్స్కి చాల చాల బాగుంటాయి.
No comments:
Post a Comment